Wednesday, April 30, 2008

కవి కుటీరం


ఇది

నా చిత్రకవితా పర్ణశాల

కవిత వాస్తవాలను పుష్పించే వృక్షం

ఆజ్ఞానాన్ని సంహరించవలసిన ఖడ్గం.


కవితలను చదవడం నా వ్యసనం..

అందుకే

తే.గీ. మనసునూపు భావాలలో మధువు మరిగి

మధురలోకాల వీక్షించు మార్గమెరిగి

మసగు ఊహలనూగించు మగిడి యెరిగి

మరులపంటలనూర్పుట మరిగినాను.

-మన్నవ

1 comment:

రాఘవ said...

భలే.

తే.గీ. ఆటలాడేటి రాయంచజంట చూసి
మనసు పరవశించి పలుకు పలుకె పలుకు
మధుర భావము లెన్నియో మాట రాక
మూగనై తడబడి చిన్నబోతి నేను.